Friday, December 11, 2020
ద్వాదశ జ్యోతిర్లింగములు
ద్వాదశ జ్యోతిర్లింగములు
సౌ రాష్ట్రే సోమనాథశ్చ శ్రీ శైలే మల్లికార్జునః | ఉజ్జయిన్యాం మహాకాల ఓంకారే చామరేశ్వరః ||
కేదారో హిమవత్పృష్ఠే డాకిన్యాం బీమ శంకరః | వారాణస్యాం చ విశ్వేశస్త్ర్యంబకో గౌతమీతటే ||
వైద్యనాథశ్చితా భూమౌ నాగేశో దారుకావనే | సేతుబంధే చ రామేశో ఘుశ్మేశశ్చ శివాలయే ||
అవతారద్వాదశకమేతచ్ఛంభోః పరాత్మనః | సర్వానందకరం పుంసాం దర్శనస్పర్శనాన్మునే ||
సౌరాష్ట్ర దేశములో సోమనాథుడు, శ్రీశైలములో మల్లికార్జునుడు, ఉజ్జయినిలో మహాకాలుడు, ఓంకారములో అమరేశ్వరుడు . హిమవచ్చిఖరముపై కేదారేశ్వరుడు, డాకినిలో భీమశంకరుడు, వారాణసిలో విశ్వేశుడు, గౌతమీ తీరమునందు త్ర్యండకుడు , చితాబూమిలో వైద్యనాథుడు, దారుకావనములో నాగేశుడు, సేతు బంధములో రామేవుడు, శివాయములో ఘుశ్మేశుడు అనునవి పరమాత్మయగు శంభుని పన్నెండు అవతారములు. ఓ మునీ! ఈ లింగములు మానవులకు స్పృశించుటచే మరియు దర్శించుటచే సర్వానందములనిచ్చును.
ఓ మునీ! వాటిలో మొదటిది సోమనాథుడు. ఆయన చంద్రుని దుఃఖమును పోగొట్టినాడు. ఆయనను పూజించినచో క్షయ, కుష్ఠ ఇత్యాది రోగములు తొలగిపోవును . శివుడు పూర్వము మంగళకరమగు సౌరాష్ట్రదేశములో లింగరూపములో ఆవిర్బవించగా చంద్రుడు ఆయనను అర్చించెను
అచటనే సర్వపాపములను పోగొట్టే చంద్రకుండము గలదు. బుద్ధి మంతుడగు మానవుడు దానియందు స్నానము చేసి రోగములన్నిటినుండి విముక్తిని పొందవచ్చును . పరమాత్మ స్వరూపమగు శివుని సోమేశ్వరమహాలింగమును దర్శించు మానవుడు పాపమునుండి విముక్తిని భక్తిని మరియు ముక్తిని పొందును. . వత్సా! భక్తుల అభీష్టఫలములనిచ్చు శంకరుడు శ్రీగిరియందు మల్లికార్జునుడను పేరుతో అవతరించెను. ఇది రెండవ జ్యోతిర్లింగము . పుత్రసంతానమును కోరువారు లింగరూపములో నున్న మల్లికార్జునుని స్తుతించెదరు. ఓ మునీ! శివుడు తన కైలాసమునండి శ్రీ శైలమునకు మహానందముతో విచ్చేసెను . ఓ మునీ! ఆ రెండవ జ్యోతిర్లింగమును దర్శించి పూజించువారికి మహాసుఖములు కలుగుటయే గాక మరణించిన పిదప ముక్తి లభించుననుటలో సందియము లేదు . వత్సా! తన భక్తులను మహాకాలుడను పేర కాపాడే శివుని అవతారము ఉజ్జయినీ నగరములో ఆవిద్బవించెను . దూషణడను రాక్షసుడు వేదధర్మమును నశింపజేయువాడై బ్రాహ్మాణులను ద్వేషిస్తూ ఉజ్జయినిలో గల సర్వమును నాశనము చేసెను. అపుడు బ్రాహ్మణులు వారి పుత్రులు వేదములతో శివుని ప్రార్థించగా ఆయన వెంటనే రత్నమాల నగర నివాసియగు ఆ దూషణుని హుంకారముచే భస్మము చేసెను , . తన భక్తులను రక్షించే ఆ మహాకాలుడు దేవతలచే ప్రార్థింపబడినవాడై అచటనే జ్యోతిర్లింగరూపములో ఆవిర్భవించి స్థిరముగా నుండెను .
మహాకాలేశ్వరలింగమును దర్శించి శ్రద్ధతో అర్చించు మానవుడు సమస్తమైన అభీష్టములను పొందుటయే గాక, మరణించిన పిదప ఉత్తమ గతిని పొందును . శంభుపరమాత్మ ఓంకారేశ్వరుని రూపములో కూడ అవతరించినాడు. ఈ నాల్గవ అవతారము భక్తులకు ఫలము నిచ్చి కోర్కెలనీడేర్చుచున్నది . వింధ్యుడు యథావిధిగా శివలింగమును స్థాపించి భక్తితో అర్చించెను. ఓ మునీ! ఆ పార్థివలింగము నుండి మహాదేవుడు ఆవిర్బవించి వింధ్యుని కోర్కెను తీర్చెను . లింగరూపములో భక్తులకు భుక్తిని ముక్తిని ఇచ్చువాడు, భక్తప్రియుడునగు శివుడు దేవతల ప్రార్థనను మన్నించి అచట రెండు రూపములలో ఆవిర్బవించెను . ఓ మహర్షీ! వాటిలో ఒకటి ఓంకారములో ఓంకారేశ్వరుడను పేర ఆవిర్భవించిన ఉత్తమలింగము. పరమేశ్వరుడు అను పేరు గల పార్థివలింగము రెండవది . ఓ మహర్షీ! పైన వర్ణింపబడిన మహాదివ్యములగు ఈ రెండు జ్యోతిర్లింగములలో ఏ ఒక్కదానినైననూ దర్శించి అర్చించు భక్తుల అభీష్టములను పరమేశ్వరుడు తీర్చును . పరమశివుడు కేదారమునందు కేదారేశ్వరుడను పేర అయిదవ జ్యోతితర్లింగముగా అవతరించి యున్నాడు .
ఓ మహర్షీ! హిమవత్పర్వతమునందలి కేదారములో హరియొక్క అవతారములగు నరనారాయణులు గలరు. వారు మరియు అచటనున్న ఇతరులు ప్రార్థించగా శివుడు అచట కేదారేశ్వరనామముతో అవతరించి ప్రతిదినము వారిద్దరి పూజలనందుకొనుచున్నాడు. కేదారేశ్వరుని దర్శించి అర్చించు భక్తుల కోర్కెలను శంభుడు నెరవేర్చును , . వత్సా! శివుడు సర్వేశ్వరుడే అయిననూ, ఈ అవతారములో విశేషించి ఆ ప్రాంతమునకు ప్రభువై వెలసినాడు ఈ శివావతారము కోర్కెల నన్నిటినీ ఈడేర్చునని ప్రసిద్ది . గొప్ప లీలలను నెరపు శంభుమహాప్రభుడు భీమశంకరుడను పేర ఆరవ సారి అవతరించి భీమాసురుని సంహరించినాడు . సుదక్షిణుడను పేరుగల భక్తుడగు కామరూప దేశప్రభువును, భక్తులకు దుఃఖమును కలుగజేయు భయంకరుడగు భీమాసురుని బారినుండి ఆయన రక్షించెను . ఆ రాజుయొక్క ప్రార్థనను మన్నించి శంకరుడు డాకినీ నగరములో భీమశంకరుడను పేర జ్యోతిర్లింగమై స్వయముగా వెలసియున్నాడు . ఓ మునీ! సర్వ బ్రహ్మాండస్వరూపుడు, భుక్తిని ముక్తిని ఇచ్చువాడు నగు శంకరుడు కాశీనగరములో విశ్వేశ్వరుడై ఏడవ జ్యోతిర్లింగముగా అవతరించినాడు.
విష్ణువు మొదలగు సర్వదేవతలు, కైలాసగిరీశుడు మరియు భైరవుడు కూడ ఆయనను నిత్యము భక్తితో పూజించెదరు . ముక్తి దాతయగు శివప్రభుడు స్వీయనగరమలో స్వయంభూజ్యోతిర్లింగ స్వరూపుడై వెలసియున్నాడు . ఎవరైతే కాశీనగరమును, విశ్వేశ్వరుని ఆరాధించి భక్తితో శివుని నామమును జపించెదరో వారు సర్వదా కర్మ బంధమునుండి విముక్తులై కైవల్యపదమును పొందెదరు . చంద్రమౌళి యెక్క ఎనిమిదవ త్ర్యండకావతారము గౌతమి మహర్షి ప్రార్థించగా గౌతమీ నదీ తీరమునందావిర్భవించెనను . గౌతమ మహర్షి ప్రార్థనచే ఆ మహర్షికి ప్రీతిని కలిగించ గోరి శివుడు జ్యోతిర్లింగ రూపములో అచట స్థిరముగా నున్నాడు . ఆశ్చర్యము! ఆ మహేశ్వరుని దర్శించి స్పృశించువారలకు కోర్కెలన్నియూ ఈడేరుటయే గాక, దేహ త్యాగము తరువాత ముక్తి కలుగును . శివునకు ప్రియురాలు పావనియగు గంగ శివుని అనుగ్రహము వలన గౌతమునకు ప్రీతిని కలిగించుటకై అచట గౌతమి యను పేరుతో ప్రవహించెను .
ఆ జ్యోతిర్లింగములలో తొమ్మిదవ అవతారము వైద్యనాథుడు. అనేకలీలలను ప్రకటించు ఆ ప్రభుడు రావణుని కొరకై ఆ రూపములో ఆవిర్భవించినాడు . రావణుడు తనను గొని పోవుట అను మిషను ఆధారముగా చేసుకొని మహేశ్వరుడు చితాభూమియందు జ్యోతిర్లింగ స్వరూపములో వెలసి యున్నాడు . వైద్యనాథేశ్వరుని పేరు ముల్లోకములలో ప్రసిద్థిని గాంచెను. ఆయనను భక్తితో దర్శించి పూజించు వారలకు ఆయన భుక్తిని ముక్తిని కూడ ఇచ్చును . ఓ మహర్షీ ! వైద్యనాథేశ్వరుని రూపములో అవతరించిన శివుని మహత్మ్యమును మరియు ఈ ఉపదేశమును పఠించువారలకు మరియ వినువారలకు కూడ భుక్తి, ముక్తి లభించును . పదియవ అవతారము నాగేశ్వరుడని కీర్తింపబడినాడు. సర్వదా దుష్టులను శిక్షించు శివుడు తన భక్తుని కొరకై ఆ రూపములో ఆవిర్భవించినాడు. ఆయన ధర్మవిధ్వంసియగు దారుకాసురుని సంహరించి వైశ్యప్రభువు, తనకు భక్తుడు అగు సుప్రియుని రక్షించెను . అనేక లీలలను ప్రకటించు ఆ శంభు ప్రభుడు లోకములకు ఉపకారమును చేయుట కొరకై పార్వతితో గూడి జ్యోతిర్లింగరూపములో ప్రకటమై స్థిరముగా నెలకొనెను .
ఓ మునీ ! నాగేశ్వరుడను పేరు గల శివలింగమును చూచి అర్చించినచో, వెంటనే మహాపాపముల గుట్టలైననూ పూర్తిగా నశించును . శివుని పదకొండవ అవతారము రామేశ్వరుడని స్మరింపబడినది. ఓ మునీ ! రామునిచే స్థాపించ బడిన ఆ రామేశ్వరుడు రామచంద్రునకు హితమును కల్గించినాడు . భక్త ప్రియుడగు ఆ శంకరుడు లింగరూపములో ఆవిర్భవించి మిక్కిలి సంతసించినవాడై రామునకు విజయమును వరముగా నిచ్చెను . ఓ మునీ! రామునిచే సేవింపబడిన ఆ శివుడు రామునిచే అధికముగా ప్రార్థింపబడి సేతుబంధమునందు స్థిరముగా వెలసెను . రామేశ్వరుని మహిమ అద్భుతమేనది. భూలోకములో దాని సాటి మరియొకటి లేదు. రామేశ్వరుడు సర్వదా భక్తులకు కామములను, భుక్తిని, ముక్తిని కూడ ఇచ్చుచుండును . ఏ మానవుడు ఆయనను గంగా జలముతో మహాభక్తి పూర్వకముగా అభిషేకించునో, ఆ మానవుడు ఆ రామేశ్వరుని అనుగ్రహముచే జీవన్ముక్తుడగును . అట్టివాడు ఇహలోకములో దేవతలకు కూడ దుర్లభమగు భోగములన్నిటినీ అనుభవించి దేహత్యాగానంతరము పరమ జ్ఞానమును మోక్షమును పొందును.
శంకురుని పన్నెండవ అవతారము ఘుశ్మేశ్వరుడు. భక్తవత్సలుడగు శివుడు అనేకలీలలను ప్రకటించి ఘుశ్మకు ఆనందమును కలిగించెను . ఓ మునీ! దక్షిణ దిక్కునందు దేవశైలమునకు సమీపములో శివుడు సరస్సునందు ఆవిర్భవించి ఘుశ్మకు ప్రీతిని కలిగించినాడు . ఓ మహర్షీ! సుదేహ ఘశ్మయొక్క పుత్రుని సంహరించగా, అమెభక్తికి భక్త వత్సలుడగు శంభుడు సంతసించి ఆతనిని పూర్తిగా రక్షించెను . ఆమె ప్రార్థించగా ఆ శంభుడు ఆమె కోర్కెను ఈడేర్చువాడై అచటి సరస్సులో ఘుశ్మేశ్వురుడను పేర జ్యోతిర్లింగరూపుడై వెలసెను . ఆ శివలింగమును దర్శించి భక్తితో ఆరాధించు వ్యక్తి ఇహలోకములో సుఖములనన్నిటినీ అనుభవించి తరువాత ముక్తిని కూడ పొందును . ఈ తీరున నేను నీకు భుక్తిని ముక్తిని ఇచ్చే దివ్యమగు పన్నెండు జ్యోతిర్లింగముల క్రమమును చక్కగా చెప్పియుంటిని . ఈ జ్యోతిర్లింగవృత్తాంతమును ఎవడు పఠించునో, లేక వినునో వాడు పాపములన్నింటి నుండి విముక్తుడై భుక్తిని మరియు ముక్తిని పొందును . నేను ఇంతవరకు శతరుద్రసంహితను వర్ణించితిని. కోర్కెలనన్నిటినీ ఈడేర్చి ఫలములనిచ్చే ఈ సంహితయందు వంద అవతారముల పుణ్యకీర్తి వర్ణింపబడినది . ఎవడైతే దీనిని నిత్యము పఠించునో లేదా సమాహితచిత్తుడై వినునో, వాడు అభీష్టముల నన్నింటినీ పొంది పిదప నిశ్చయముగా ముక్తిని పొందును .
శ్రీ శివమహాపురాణములో శతరుద్ర సంహితయందు ద్వాదశజ్యోతిర్లింగ వర్ణనమనే నలుబది రెండ అధ్యాయము.
Wednesday, December 9, 2020
అర్జున కృత శ్రీ శంకర స్తుతి
అర్జున కృత శ్రీ శంకర స్తుతి
అర్జున ఉవాచ |
భక్త ప్రియస్య శంభోస్తే సు ప్రభో కిం సమీహితమ్ | వర్ణనీయం మయా దేవ కృపాలుస్త్వం సదాశివ ||
ఇత్యుక్త్వా సంస్తుతిం తస్య శంకరస్య మహాప్రభోః | చకార పాండవస్సో థ సద్భక్తిం వేదసంమతామ్ ||
నమస్తే దేవ దేవాయ నమః కైలాసవాసినే | సదాశివ సమస్తుభ్యం పంచవక్త్రాయ తే నమః ||
కపర్దినే నమస్తుభ్యం త్రినేత్రాయ నమోస్తు తే | నమః ప్రసన్నరూపాయ సహస్రవదనాయ చ ||
నీలకంఠ నమస్తేస్తు సద్యోజాతాయ వై నమః | వృషధ్వజ నమస్తేస్తు వామాంగ గిరిజాయ చ ||
దశదోష నమస్తుభ్యం నమస్తే పరమాత్మనే | డమరు కపాలహస్తాయ నమస్తే ముండమాలినే ||
శుద్ధస్పటిక సంకాశ శుద్ధకర్పూర వర్ష్మణే | పినాకపాణయే తుభ్యం త్రి శూలవరధారిణే ||
వ్యాఘ్రచర్మోత్తరీయాయ గజాంబరవిధారిణే | నాగాంగాయ నమస్తుభ్యం గంగాధర నమో స్తు తే ||
సుపాదాయ నమస్తే స్తు ఆరక్త చరణాయ చ | నంద్యాది గణసేవ్యాయ గణేశాయ చ తే నమః ||
నమో గణేశరూపాయ కార్తికేయానుగాయ చ | భక్తిదాయ చ భక్తానాం ముక్తాదాయ నమో నమః ||
అగుణాయ నమస్తేస్తు సగుణాయ నమో నమః | అరూపాయ సరూపాయ సకలాయాకలాయ చ ||
నమః కిరాతరూపాయ మదనుగ్రహకారిణే | యుద్ధప్రియాయ వీరాణాం నానాలీలానుకారిణే||
Thursday, December 3, 2020
యక్షేశ్వర రూప మహాదేవ స్తుతి
యక్షేశ్వర రూప మహాదేవ స్తుతి
Wednesday, December 2, 2020
శ్రీ వీరేశ్వరాభిలాషాష్టకం - శ్రీ శివమహాపురాణము
శ్రీ వీరేశ్వరాభిలాషాష్టకం - శ్రీ శివమహాపురాణము
విశ్వానర ఉవాచ .
ఏకం బ్రహ్మైవాద్వితీయం సమస్తం సత్యం సత్యం నేహ నానాఽస్తి కిం తు .
ఏకో రుద్రో న ద్వితీయోఽవతస్థే తస్మాదేకం తత్త్వాం ప్రపద్యే మహేశం .. 1..
ఏకః కర్తా త్వం హి సర్వస్య శంభో నానారూపేష్వేకరూపోఽప్యరూపః .
యద్వత్ప్రత్యగ్ధర్మ ఏకోఽప్యనేకస్తస్మాన్నాన్యం త్వాం వినేశం ప్రపద్యే .. 2..
రజ్జౌ సర్పః శుక్తికాయాం చ రౌప్యం నైరః పూరస్తన్మృగాఖ్యే మరీచౌ .
యద్యత్తద్వద్విష్వగేషః ప్రపంచో యస్మిన్ జ్ఞాతే త్వాం ప్రపద్యే మహేశం .. 3..
తోయే శైత్యం దాహకత్వం చ వహ్నౌ తాపో భానౌ శీతభానౌ ప్రసాదః .
పుష్పే గంధో దుగ్ధమధ్యేఽపి సర్పిర్యత్తచ్ఛంభో త్వం తతస్త్వాం ప్రపద్యే .. 4..
శబ్దం గృహ్ణాస్యశ్రవాస్త్వం హి జిఘ్రేరఘ్రాణస్త్వం వ్యంఘ్రిరాయాసి దూరాత్ .
వ్యక్షః పశ్యేస్త్వం రసజ్ఞోఽప్యజిహ్వః కస్త్వాం సమ్యగ్వేత్త్యతస్త్వాం ప్రపద్యే .. 5..
నో వేదస్త్వామీశ సాక్షాద్వివేదో నో వా విష్ణుర్నో విధాతాఽఖిలస్య .
నో యోగీంద్రా నేంద్రముఖ్యాశ్చ దేవా భక్తో వేదస్త్వామతస్త్వాం ప్రపద్యే .. 6..
నో తే గోత్రం నాపి జన్మాపి నాఖ్యా నో వా రూపం నైవ శీలం న తేజః .
ఇత్థం భూతోఽపీశ్వరస్త్వం త్రిలోక్యాః సర్వాన్కామాన్పూరయేస్త్వం భజే త్వాం .. 7..
త్వత్తత్సర్వం త్వం హి సర్వం స్మరారే త్వం గౌరీశస్త్వం చ నగ్నోఽతిశాంతః .
త్వం వై వృద్ధస్త్వం యువా త్వం చ బాలస్తత్కిం యత్త్వం నాస్యతస్త్వాం నతోఽహం .. 8..
విశ్వానరుడిట్లు పలికెను-
బ్రహ్మ సజాతీయ విజాతీయ స్వగతభేదములు లేని పూర్ణ సత్యతత్త్వము. ఈ నానాత్వము కన్పట్టునదియే గాని సత్యము గాదు. రుద్రుడు ఒక్కడే గలడు.రెండవ తత్త్వము లేదు. కావున అద్వయుడవు, మహేశుడవు అగు నిన్ను శరణు జొచ్చుచున్నాను (1).
హే శంభో! సర్వమును సృష్టించి లయము చేయువాడవు నీవే. వివిధరూపములలో అఖండసత్తారూపములో నుండే నీకు రూపము లేదు. ప్రత్యగాత్మ స్వరూపుడవగు నీవు అద్వయుడవైననూ అనేకముగ కన్పట్టు చున్నావు. కావున ఈశ్వరుడవగు నిన్ను తక్క ఇతరమును నేను శరణు పొందుట లేదు (2).
త్రాడు నందు పాము, ముత్యపు చిప్ప యందు వెండి, ఎండమావుల యందు నీరు ఎట్లు మిథ్యయో, అటులనే సద్ఘనుడవగు నీ యందు విశ్వము మిథ్యయగును. దేనిని తెలిసినచో ప్రపంచము తత్త్వతః తెలిసినట్లు యగునో, అట్టి మహేశుని శరణు పొందుచున్నాను (3).
నీటియందలి చల్లదనము, నిప్పుయందలివేడి, సూర్యుని యందలి తాపము, చంద్రుని యందలి ఆహ్లాదకత్వము, పుష్పమునందలి పరిమళము, పాలలోని వెన్న నీవే. కావున, హే శంభో! నిన్ను నేను శరణు వేడుచున్నాను (4).
నీవు శబ్దమును వినెదవు. కాని నీకు చెవులు లేవు. నీవు ఆఘ్రాణించెదవు. కాని నీకు ముక్కులేదు. నీకు పాదము లేకున్ననూ దూరమునుండి వచ్చెదవు. కన్నులు లేని నీవు చూచుచున్నావు. జిహ్వ లేని నీవు రుచిని తెలియుచున్నావు. నీ స్వరూపమును పూర్ణముగాఎవరు ఎరుంగగలరు? కావున నిన్ను శరణు వేడుచున్నాను (5).
ఓ ఈశ్వరా! వేదము సాక్షాత్తుగా నిన్ను ఎరుంగక జాలదు. విష్ణువు గాని, సర్వమును సృజించు బ్రహ్మగాని నిన్ను యెరుంగరు. యోగిశ్రేష్ఠులు, ఇంద్రాదిదేవతలు నిన్ను ఎరుంగరు. కాని, భక్తుడు నిన్ను తెలియగల్గును. కావున నిన్ను శరణు పొందుచుచున్నాను (6).
నీకు గోత్రములేదు. జన్మనాశములు లేవు. నీకు రూపము లేదు. శీలము లేదు. దేశము లేదు. ఇట్టివాడవైననూ, నీకు ముల్లోకములకు ప్రభుడవు. నేను నిన్ను సేవించుచున్నాను నాకోర్కెలనన్నిటినీ ఈడేర్చుము (7).
ఓ మన్మథాంతకా! సర్వము నీనుండి ఉద్భవించినది. సర్వము నీవే. గౌరీపతివి నీవు. దిగంబరుడవు అగు నీవు పరమ శాంత స్వరూపుడవు. వృద్ధుడవు నీవే. యువకుడవు నీవే. బాలుడవు నీవే. నీచే వ్యాప్తము కాని తత్త్వము ఏది గలదు? నేను నిన్ను నమస్కరించుచున్నాను (8).
స్తుత్వేతి భూమౌ నిపపాత విప్రః స దండవద్యావదతీవ హృష్టః .
తావత్స బాలోఽఖిలవృద్ధవృద్ధః ప్రోవాచ భూదేవ వరం వృణీహి ..
ఆ బ్రాహ్మణుడు ఇట్లు స్తుతించి చేతులను కట్టుకొని సాష్టాంగ ప్రణామము నాచరించునంతలో, వృద్ధులందరిలో వృద్ధుడగు ఆ బాలుడు మిక్కిలి ఆనందించి ఆ బ్రాహ్మణునితో నిట్లనెను
తత ఉత్థాయ హృష్టాత్మా మునిర్విశ్వానరః కృతీ .
ప్రత్యబ్రవీత్కిమజ్ఞాతం సర్వజ్ఞస్య తవ ప్రభో ..
అపుడు కృతార్థుడైన విశ్వానరమహర్షి ఆనందముతో నిండిన మనస్సు గలవాడై లేచి నిలబడి బాలుని రూపములోనున్న శంకరునకు ఇట్లు బదులిడెను.
మహేశ్వర కిమజ్ఞాతం సర్వజ్ఞస్య తవ ప్రభో
సర్వాంతరాత్మా భగవాన్సర్వః సర్వప్రదో భవాన్ .
యాత్రాప్రతినియుక్తే మాం కిమీశో దైన్యకారిణీం .
ఇతి శ్రుత్వా వచస్తస్య దేవో విశ్వానరస్య హ .
శుచిః శుచివ్రతస్యాథ శుచిస్మిత్వాబ్రవీచ్ఛిశుః ..
మహేశ్వర ప్రభూ! సర్వజ్ఞుడవగు నీకు తెలియనది ఏమున్నది? నీవు సర్వుల అంతరంగములో నుండే భగవానుడవు. సర్వమును ఇచ్చే శర్వుడవు. అయిననూ, నీవు నన్ను దైన్యమును కలిగించే యాచనయందు ఏల నియోగించుచున్నావు? ఓ మహేశ్వరా! సర్వము నీకు తెలియును. కావున నీకు తోచినట్లు చేయుము.
బాల ఉవాచ .
త్వయా శుచే శుచిష్మత్యాం యోఽభిలాషః కృతో హృది .
అచిరేణైవ కాలేన స భవిష్యత్యసంశయః ..
తవ పుత్రత్వమేష్యామి శుచిష్మత్యాం మహామతే .
ఖ్యాతో గృహపతిర్నామ్నా శుచిః సర్వామరప్రియః ..
అభిలాషాష్టకం పుణ్యం స్తోత్రమేతత్త్వయేరితం .
అబ్దం త్రికాలపఠనాత్కామదం శివసన్నిధౌ ..
ఏతత్స్తోత్రస్య పఠనం పుత్రపౌత్రధనప్రదం .
సర్వశాంతికరం చాపి సర్వాపత్పరినాశనం ..
స్వర్గాపవర్గసంపత్తికారకం నాత్ర సంశయః .
ప్రాతరుత్థాయ సుస్నాతో లింగమభ్యర్చ్య శాంభవం ..
వర్షం జపమిదం స్తోత్రమపుత్రః పుత్రవాన్భవేత్ .
వైశాఖే కార్తికే మాఘే విశేషనియమైర్యుతః ..
యః పఠేత్స్నానసమయే లభతే సకలం ఫలం .
కార్తికస్య తు మాసస్య ప్రసాదాదహమవ్యయః ..
తవ పుత్రత్వమేష్యామి యస్త్వన్యస్తత్పఠిష్యతి .
అభిలాషాష్టకమిదం న దేయం యస్య కస్యచిత్ ..
గోపనీయం ప్రయత్నేన మహావంధ్యాప్రసూతికృత్ .
స్త్రియా వా పురుషేణాపి నియమాల్లింగసన్నిధౌ ..
అబ్దం జపమిదం స్తోత్రం పుత్రదం నాత్ర సంశయః .
ఇత్యుక్త్వాంతర్దధే బాలః సోపి విప్రో గృహం గతః ..
శుద్ధవ్రతుడగు ఆ విశ్వానరుని ఈ మాటను విని పవిత్ర శిశురూపములో నున్న శివదేవుడు చిరునవ్వుతో అపుడిట్లనెను (. ఓయీ పవిత్రుడా! నీవు ఎట్టి పుత్రుని శుచిష్మతియందు బడయవలెనని హృదయములో కోరుకుంటివో, అట్టి పుత్రుడు శీఘ్రముగా నిస్సంశయముగా లభించగలడు . ఓ మహాత్మా! నేను శుచిష్మతి యందు నీ పుత్రుడనై జన్మించి గృహపతి యను పేరుతో ప్రసిద్ధిని గాంచి పావనుడనై దేవతలందరికీ ప్రియుడను కాగలను. నీవు పలికిన అభిలాషాష్టకమను పేరు గల పవిత్రమగు ఈ స్తోత్రమును శివుని సన్నిధిలో మూడు కాలములయందు సంవత్సరకాలము పఠించినచో కోర్కెలు ఈడేరును. ఈ స్తోత్రమును పఠించినచో పుత్రులు, పౌత్రులు, ధనము లభించి ఆపదలన్నియు దూరమై సంపూర్ణమగు శాంతి కలుగును. ఈ స్తోత్రము స్వర్గమోక్షములను, సంపదను ఇచ్చుననుటలో సందేహము లేదు. సర్వదా కోర్కెలనన్నిటినీ ఈడేర్చు ఈ ఒక్క స్తోత్రము ఇతరస్తోత్రములన్నింటితో సమమైనది.
సంవత్సరకాలము ఉదయమే నిద్ర లేచి చక్కగా స్నానము చేసి శంభుని లింగమును పూజించి ఈ స్తోత్రమును జపించినచో, పుత్రుడు లేని వానికి పుత్రుడు కలుగును. ఈ అభిలాషాష్టకమును ఎవడు కనబడితే వానికి చెప్పరాదు. దీర్ఘకాల వంధ్యయైననూ ప్రసవించునట్లు చేయగల ఈ స్తోత్రమును శ్రద్ధతో పరిరక్షించవలెను. స్త్రీగాని, పురుషుడు గాని లింగసన్నిధిలో నియమపూర్వకముగా సంవత్సరకాలము ఈ స్తోత్రమును జపించినచో, నిస్సంశయముగా పుత్రుడు కలుగును. సత్పురుషులకు శరణ్యుడు, బాలరూపములో నున్న వాడు అగు శంభుడు ఇట్లు పలికి అంతర్ధానమయ్యెను. ఆ విశ్వానరమహర్షి కూడా ఆనందముతో నిండిన మనస్సు గలవాడై తన ఇంటికి చేరుకొనెను.
శ్రీ శివ మహాపురాణములోని శతరుద్ర సంహితయందు గృహపత్యవతారవర్ణనమనే పదమూడవ అధ్యాయము